02 మే, 2011

భాగ్యనగరం బాగుపడనుందా...?

మొన్న శనివారం నాడు చెమటోడ్చి కష్టపడి కంపనీని పైకి తీసుకొద్దామనే దురాలోచనతో ఆఫీసుకొచ్చా. యథాలాపంగా పని మొదలుపెట్టి, మధ్యలో మన తెలుగు మీడియా కడప ఎన్నికల మీద ఎలా కోడై కూస్తోందో చూద్దామని రెండు మూడు సైట్లు ఓపెన్ చేస్తే ఒక కత్తిలాంటి వార్త కనబడింది. మజ్లిస్ చిన్న వారసుడు అక్బరుద్దీన్ మీద దాడి. ఒక్కసారి మనసంతా సంతోషంతో ఉప్పొంగింది.

మామూలుగా మన మీడియాకు చాలా విషయాలు కనపడవు. కానీ, ఏదో ఒకటి అయినప్పుడు మాత్రం మొత్తం విషయం బయటికి లాగేస్తారు. ఈ వార్త చూడగానే నాకు గుర్తొచ్చిన మొదటి మనిషి కృష్ణ యాదవ్. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి నాలుగేల్లు మంత్రిగా చేసిన భగ్యనగరపు నాయకుడు. మంత్రిగా చేసినా కూడా సందు గొందుల్లో వుండే సొంతిల్లు వదిలి అధికార నివాసంలోకి రాకపోతే అందరూ అది తనకు తన నియోజకవర్గం మీద, ఆ ఏరియాతో వున్న అనుబంధం వల్ల అని అనుకున్నారు. అలా అనుకునేలా చేసింది కూడా మీడియానే. స్టాంప్ పేపర్ల కుంభకోణంలో దొర గారిని అరెస్టు చేసిన తర్వాత అయ్యవారి చరిత్ర తోడిన మీడియా తేల్చిందేమిటంటే, అన్నగారు ఆ ఇల్లు వదలంది తన రౌడీ రాజ్యాన్నీ సజీవంగా నిలుపుకునేందుకు, అంతర్గత వ్యవహారాలు నెరిపేందుకు అని. మొన్నటికి మొన్న ప్రపంచ స్థాయి కంపనీని నడుపుతున్నాడని రామలింగరాజుని ఆకాశానికెత్తిన మీడియా, సత్యం కుంభకోణం బయటపడ్డ వారంలోపు రాజుగారు జీవితకాలంలో చేసిన ప్రతీ చిన్న తప్పునూ వెలికితీసి ఎండగట్టింది.

పాతబస్తీలో జరిగే చాలా విషయాలు బయటికి పొక్కవని నా ప్రగాఢ నమ్మకం. అందుకు ముఖ్య కారణం అక్కడ బలంగా వున్న మజ్లిస్. పార్టీ పేరు చెప్పి, పార్టీ పెద్దల పేర్లు చెప్పి అక్కడ ఎన్ని సెటిల్‌మెంట్లు జరిగాయో, జరుగుతున్నాయో బయటికి పొక్కదు. పైగా వారికి మన సూడో సెక్యులర్ పాలకుల అండ వుండనే వుంది. నిజం చెప్పాలంటే, రెండెళ్ల కింద జరిగిన ఎన్నికల వరకూ నాకు ఒక అభిప్రాయం వుండేది. అక్బర్ యెదవ కానీ, అసద్ మంచోడేమో అని. ఎంతైనా ఫారెన్‌లో చదువుకొచ్చాడు కదా, చదువు మధ్యలో వదిలేసి చిల్లరగా తిరిగిన తింగరోనికంటే మర్యాదగా వుంటాడు అని అనుకునేవాన్ని. కానీ, మొన్న ఎన్నికలవేళ అసద్ చేసిన వీరంగం చూసి రోత పుట్టింది. చదువుకున్నవాడే అలా చేస్తే ఇంక రాజకీయాలు ఎటు పోతున్నాయ్ అని ఆవేదన కలిగింది. వీడే ఇలా వుంటే, చదువు మధ్యలో మానేసిన అక్బర్ ఎలా వుండాలి...? గూండాగిరి, రాజకీయం, సెటిల్‌మెంట్లు అంటూ నేర ప్రపంచంలో ఎంత లోతువరకు దిగి వుంటే పబ్లిగ్గా చంపే ప్రయత్నం చేయాలి...?

నాకేమో ఈపాటికే అక్బర్ చచ్చుంటాడని అనుమానం. వెంటనే చంపేస్తే పాతబస్తీలో శాంతిభద్రతల సమస్య వస్తుందేమో అన్న అనుమానంతో సర్కారు వెంటిలేటర్లమీద బతికిస్తోందని అనిపిస్తోంది. ఏతా వాతా, ఇప్పుడు వీడు చస్తే, దర్యాప్తు ముసుగులో పోలీసులు నిజాలు చెప్పడానికి ప్రభుత్వం వొప్పుకోకున్నా, ఈ కుటుంబం పాతబస్తీలో ఎలాంటి సంస్కృతిని పెంచి పోషించిదనే విషయాన్ని మీడియా అయినా బయటికి తెస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నా. భాగ్యనగరం బాగుపడాలంటే, పాతబస్తీలో మతం చాటున కొంతమంది నరనరాల్లో పాతుకుపోయిన విష సంస్కృతి పోవాలంటే, ఈ కుటుంబం అక్కడ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోవాలని నా విశ్వాసం.

అందుకే ఆలోచిస్తున్నా... అక్బర్ పోతాడా...? మీడియా అతని చరిత్రనూ, అన్న, తండ్రుల చరిత్రనూ తవ్వుతుందా...? భాగ్యనగరం బాగుపడబోతోందా....???